అందంతో పాటు చక్కటి
అభినయకౌశలం కలబోసిన అచ్చ తెలుగమ్మాయి స్వాతి. స్వామిరారా కార్తికేయ
చిత్రాలతో తెలుగులో వరుస విజయాల్ని సొంతం చేసుకున్న ఈ చలాకీ సుందరి అటు
తమిళ, మలయాళ చిత్రసీమల్లో కూడా సత్తా చాటుతోంది. ఆ రెండు భాషల్లో అరడజనుకు
పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. అల్లరి, చిలిపిదనం మేళవించిన
పాత్రలతో పాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా తనదైన
ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇదిలా వుండగా ఆమె తెలుగులో మరో క్రేజీ
ప్రాజెక్ట్కు ఓకే చెప్పింది.
వివరాల్లోకి వెళితే...అంజలి ప్రధాన పాత్రలో రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం గీతాంజలి గత ఏడాది పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి గీతాంజలి-2 పేరుతో సీక్వెల్ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సీక్వెల్లో స్వాతి కథానాయికగా నటించబోతున్నట్లు తెలిసింది. దర్శకుడు రాజకిరణ్ చెప్పిన కథలోని నవ్యత, థ్రిల్లింగ్ అంశాలు నచ్చడంతో స్వాతి ఈ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై చినబాబు నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే...అంజలి ప్రధాన పాత్రలో రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం గీతాంజలి గత ఏడాది పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి గీతాంజలి-2 పేరుతో సీక్వెల్ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సీక్వెల్లో స్వాతి కథానాయికగా నటించబోతున్నట్లు తెలిసింది. దర్శకుడు రాజకిరణ్ చెప్పిన కథలోని నవ్యత, థ్రిల్లింగ్ అంశాలు నచ్చడంతో స్వాతి ఈ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై చినబాబు నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment