శృతిహాసన్ తాజాగా
తెలుగులో మరో భారీ చిత్రంలో కథానాయికగా ఖరారైంది. వివరాల్లోకి
వెళితే...నాగార్జున, తమిళ నటుడు కార్తీ కాంబినేషన్లో దర్శకుడు
వంశీపైడిపల్లి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం
తెలిసిందే. పి.వి.పి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాలో తాను
కథానాయికగా ఎంపికైనట్లు శృతిహాసన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఆయన దర్శకత్వంలో రెండో సినిమా చేయబోతుండటం ఆనందంగా వుంది. వంశీ చెప్పిన కథలో కొత్తదనంలో పాటు ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలించే భావోద్వేగాలున్నాయి అని ట్విట్టర్లో పేర్కొంది శృతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది.
వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఆయన దర్శకత్వంలో రెండో సినిమా చేయబోతుండటం ఆనందంగా వుంది. వంశీ చెప్పిన కథలో కొత్తదనంలో పాటు ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలించే భావోద్వేగాలున్నాయి అని ట్విట్టర్లో పేర్కొంది శృతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది.
0 comments:
Post a Comment