Wednesday 1 October 2014

అఖిల్‌ను చూసి గర్విస్తున్నా!

మనం చిత్రం  క్లెమాక్స్ ఘట్టంలో తళుక్కున మెరిసి అక్కినేని వంశాభిమానుల్ని ఆనందపరవశుల్ని చేశాడు అఖిల్. అతని స్క్రీన్‌ప్రజెన్స్ అద్భుతంగా వుందని విమర్శకులు ప్రశంసించారు. దీంతో పూర్తిస్థాయి హీరోగా అతని అరంగేట్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ చిత్రం కోసం కథా చర్చలు జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది ఆ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ఇటీవలే అఖిల్ ఓ ప్రముఖ గడియారాల సంస్థ ప్రచార చిత్రంలో నటించారు. దీన్ని మంగళవారం విడుదల చేశారు. అఖిల్ తొలి వ్యాపార ప్రచార చిత్రం అంచనాలకు మించి వుందని నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. మొదటి వ్యాపార ప్రకటనలోనే అఖిల్ అందరినీ ఆకట్టుకున్నాడు. అఖిల్‌ను చూసి తండ్రిగా నేనెంతగానో గర్విస్తున్నాను అని నాగార్జున ట్విట్టర్‌లో తెలిపారు.

0 comments:

Post a Comment