బాలకృష్ణ 98వ చిత్రం టైటిల్ విషయం వివాదంలో పడింది. సత్యదేవ్ దర్శకత్వంలో
రూపొందుతున్న చిత్రానికి ‘ లయన్ ' అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్లో
రిజిస్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్తో తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఎప్పుడో
రిజిస్టర్ చేయించాను అంటూ ఓ నిర్మాత వాదిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని
పరిష్కరించుకుని డిసెంబర్ 31న టీజర్ విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్
భావిస్తున్నట్లు సమాచారం. అయితే..ముందుగా ‘లయన్' అనే టైటిల్ను
అనుకున్నప్పటికీ, ఆ టైటిల్పై వివాదం ఏర్పడడంతో చివరిగా సినిమాకు ‘వారియర్'
అనే టైటిల్ను పెట్టే అవకాశమున్నట్టు యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.
త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు
సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే బాలకృష్ణ ఫస్ట్లుక్ మంచి రెస్పాన్స్
రావడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు.
త్వరలోనే ఈ సినిమా టైటిల్ను యూనిట్ వర్గాలు ప్రకటించనున్నాయి. చిత్రం
విషయాలకి వస్తే.. ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు
శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై
యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ
చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే
కథానాయికలు. రుద్రపాటి రమణారావు నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ...
''లెజెండ్'తో బాలకృష్ణ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర
అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ
అలరిస్తాయ''న్నారు.
0 comments:
Post a Comment