Sunday 21 December 2014

ఈ ఏడాది ఆకట్టుకున్న నవ నాయికలు


ఈ సంవత్సరం తెలుగు తెరకు పరిచయమైన నూతన కథానాయికలు కొందరు అందంతో పాటు చక్కటి పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ కోవలో ముందువరుసలో నిలిచింది బెంగళూరు ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ సుందరి చక్కటి రూపలావణ్యంతో కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సొగసరి ముకుంద చిత్రంలో నటిస్తోంది. మరికొన్ని భారీ చిత్రాల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు తెలిసింది. ఇక ఆదాశర్మ (హార్ట్ ఎటాక్), అమీజాక్సన్ (ఎవడు), కృతిసనన్ (1), రాశిఖన్నా (ఊహలు గుసగుసలాడే), సనామఖ్బూల్ (దిక్కులు చూడకు రామయ్య) కూడా తొలిచిత్రంతోనే తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

0 comments:

Post a Comment