Sunday 21 December 2014

2015లో తారక్‌, చైతూ మల్టీస్టారర్‌


నాగార్జున, ఎన్టీఆర్‌ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌ తెరెకక్కుతోందంటూ ఇటీవలి కాలంలో ప్రచారమైంది. ఎవడు, బృందావనం చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కథ కూడా రెడీ చేశారు. అరుుతే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడం లేదని మధ్యలో వార్తలొచ్చారుు. అదే కోవలో నాగాచైతన్య, ఎన్టీఆర్‌ హీరోలుగా అలనాటి మేటి క్లాసిక్‌ గుండమ్మ కథ (ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌) చిత్రాన్ని రీమేక్‌ చేస్తారని ప్రచారమైంది. అరుుతే ఆ పని కూడా ఇప్పట్లో అయ్యేట్టే కనిపించలేదు. ఇంతలోనే మరో ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అగ్రనిర్మాత దిల్‌రాజు మలయాళ హిట్‌ చిత్రం బెంగళూరు డేస్‌ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటిేక తారక్‌ (ఎన్టీఆర్‌) ఈ ప్రాజెక్టులో నటించడానికి తన ఆసక్తిని వ్యక్తీకరించాడు. మరో కీలకమైన పాత్రలో నాగచైతన్య నటిస్తాడని, సిద్ధార్థ్‌సమంత జోడీ కూడా నటిస్తున్నారని వార్తలొస్తున్నారుు. ఈ ప్రాజెక్టును దిల్‌రాజు నుంచి ఓ అగ్ర నిర్మాణ సంస్థ తో కలిసి దిల్‌రాజు నిర్మించనున్నారు. ఎన్టీఆర్‌, చైతూ, సిద్ధార్థ్‌, భాస్కర్‌ కాంబినేషన్‌ అంటే ఆసక్తికరమే. ఇదో భారీ మల్టీస్టారర్‌ కిందే లెక్క.

0 comments:

Post a Comment