ఆగడు చిత్రంలో ఐటెంగర్ల్గా
ప్రేక్షకుల్ని అలరించింది శృతిహాసన్. ఈ సినిమాతో ఐటెం భామగా సత్తాచాటిన
శృతిహాసన్ మరోసారి తెలుగుతెరపై ప్రత్యేక గీతంతో సందడి చేయడానికి
సిద్ధమవుతున్నది. వివరాల్లోకి వెళితే...ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం
తెలిసిందే. మాస్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానుగుణంగా ఓ
ఐటెంసాంగ్కు చోటున్నట్లు తెలిసింది.
ఈ గీతంలో ఎన్టీఆర్కు జోడీగా శృతిహాసన్ నర్తించబోతున్నట్లు సమాచారం. ఈ ఐటెంసాంగ్ విషయమై ఇటీవలే చిత్ర వర్గాలు శృతిహాసన్ను సంప్రదించినట్లు, ఆమె కూడా ఈ గీతానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. త్వరలోనే ఈ ఐటెంసాంగ్ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ గీతంలో ఎన్టీఆర్కు జోడీగా శృతిహాసన్ నర్తించబోతున్నట్లు సమాచారం. ఈ ఐటెంసాంగ్ విషయమై ఇటీవలే చిత్ర వర్గాలు శృతిహాసన్ను సంప్రదించినట్లు, ఆమె కూడా ఈ గీతానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. త్వరలోనే ఈ ఐటెంసాంగ్ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
0 comments:
Post a Comment