ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా పాపులర్ అయిపోతోంది సన్నీలియోన్.
పోర్నస్టార్ అన్న ఇమేజ్ ఈ అమ్మడి నటజీవితానికి ప్లస్ అయ్యిందే కానీ,
మైనస్ అవ్వలేదు. అందుకు తగ్గట్టే బాలీవుడ్లో వరుసగా సినిమాలకు సంతకాలు
చేస్తూనే, కోలీవుడ్, టాలీవుడ్లో స్పీడుగా దూసుకుపోతోంది. ఇక్కడ
ఐటెమ్నంబర్లలో నర్తిస్తూనే కథని మలుపు తిప్పే క్యారెక్టర్లలో
నటించేస్తోంది. లేటెస్టుగా కరెంటు తీగలో ఈ అమ్మడు టీచరమ్మగా నటించింది. ఓ
ఐటెమ్లోనూ చిందేసింది. ఈ ఐటెమ్ నంబర్ని దాదాపు 2కోట్లు ఖర్చు చేసి
భారీగా తెరకెక్కించామని ఇటీవలే దర్శకనిర్మాతలు ప్రకటించారు.
అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే కరెంటు తీగ రిలీజవుతోంది. ఈ
సినిమా విజయం సాధిస్తే తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని సన్నీ
ఆశిస్తోందిట. అంతేకాదు టాలీవుడ్లో పెద్ద స్టార్గా ఎదగాలని తపిస్తోందని
సమాచారం. అయితే ఈ అమ్మడు నటించే ప్రతి క్యారెక్టర్కు కోటి పైగానే
పారితోషికం డిమాండ్ చేస్తోందట. కాజల్, తమన్నాకి సమానంగా!!
0 comments:
Post a Comment