నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫామెన్స చూపించిన లెజెండ్ సినిమా
ఎమ్మిగనూరు(కర్నూలు) శివ థియేటర్లో 200రోజులు ఆడి రికార్డు బ్రేక్
చేసింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బి.జయనాగేశ్వర రెడ్డి
సమక్షంలో ఈనెల 12న పెద్ద స్థాయిలో విజయోత్సవ వేడుకను నిర్వహించాలని
అభిమానులు భావించారు. అయితే అనూహ్య కారణాల వల్ల ఈ వేడుకను ఈనెల 21కి వాయిదా
వేశారని సమాచారం. నందమూరి అభిమానులకు కాస్త నిరాశ కలిగించేదే అయినా ఆ
సందర్భం అలాంటిది. బాలయ్య స్వయంగా వారించి ఈ వేడుకను వాయిదా వేయించారు.
200రోజుల వేడుక ఈనెల 21న బాలయ్యబాబు, బోయపాటి శ్రీను, జయనాగేశ్వరరెడ్డి
ముఖ్య అతిధులుగా ఎమ్మిగనూరు శివ థియేటర్లో ఘనంగా చేయడానికి సన్నాహాలు
జరుగుతున్నాయి. అలాగే బాలయ్య ప్రస్తుతం `గాడ్సే' చిత్రంలో నటిస్తున్న సంగతి
తెలిసిందే.
0 comments:
Post a Comment