నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దిక్కులు చూడకు రామయ్య. అజయ్, ఇంద్రజ, సనామఖ్భూల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సందర్భంగా గురువారం
హైదరాబాద్లో నాగశౌర్య పాత్రికేయులతో ముచ్చటిస్తూ తండ్రీకొడుకులు ఇద్దరు
ఒకే అమ్మాయిని ప్రేమించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? చెడుదారుల్లో
పయనిస్తున్న తండ్రిని కొడుకు ఏ విధంగా మార్చాడు? అనేది ఈ సినిమాలో
ఆసక్తికరంగా వుంటుంది.
కీరవాణి సంగీతం చిత్రానికి హైలైట్గా వుంటుంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనే తీరుగా నా పాత్ర సాగుతుంది. స్వతహాగా మొదటి నుంచి నాకు ఇష్టమైంది నటనే. అదే నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి దోహదపడింది. కొత్తదనంతో కూడుకున్న కథలకే నా తొలి ప్రాధాన్యత. చిత్ర పరిశ్రమలో నేను నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్లను స్ఫూర్తిగా తీసుకుంటాను. భవిష్యత్తులో వారిలా పేరుతేచ్చుకోవాలని అనుకుంటున్నాను అని అన్నారు.
కీరవాణి సంగీతం చిత్రానికి హైలైట్గా వుంటుంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనే తీరుగా నా పాత్ర సాగుతుంది. స్వతహాగా మొదటి నుంచి నాకు ఇష్టమైంది నటనే. అదే నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి దోహదపడింది. కొత్తదనంతో కూడుకున్న కథలకే నా తొలి ప్రాధాన్యత. చిత్ర పరిశ్రమలో నేను నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్లను స్ఫూర్తిగా తీసుకుంటాను. భవిష్యత్తులో వారిలా పేరుతేచ్చుకోవాలని అనుకుంటున్నాను అని అన్నారు.
0 comments:
Post a Comment