బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. భిన్న
కథాంశాలతో కూడిన చిత్రాలలో నటిస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్న
విషయం తెలిసిందే. ఇటీవల క్వీన్ చిత్రంలో తన అద్వితీయమైన నటనతో విమర్శకుల
ప్రశంసల్ని సొంతం చేసుకున్న ఈ సుందరి తొలిసారి ద్విపాత్రాభినయంతో
అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే...కంగనా రనౌత్
కథానాయికగా 2011లో వచ్చిన చిత్రం తను వెడ్స్ మను.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఘన
విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు
సీక్వెల్ను రూపొందించేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ
సినిమాలో కంగనా రనౌత్ ద్విపాత్రాభినయం చేయబోతోందని తెలిసింది. ఇందులో తను,
హర్యాన్వీ అథ్లేట్ అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతోంది. ఈ పాత్రలు
ఒకదానికొకటి సంబంధం లేకుండా కొత్తగా వుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Posted in: Tollywood News
Email This
BlogThis!
Share to Facebook
0 comments:
Post a Comment