Sunday 12 October 2014

బాలీవుడ్ క్వీన్ ద్విపాత్రాభినయం!

బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. భిన్న కథాంశాలతో కూడిన చిత్రాలలో నటిస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల క్వీన్ చిత్రంలో తన అద్వితీయమైన నటనతో విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్న ఈ సుందరి తొలిసారి ద్విపాత్రాభినయంతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే...కంగనా రనౌత్ కథానాయికగా 2011లో వచ్చిన చిత్రం తను వెడ్స్ మను.

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కంగనా రనౌత్ ద్విపాత్రాభినయం చేయబోతోందని తెలిసింది. ఇందులో తను, హర్యాన్వీ అథ్లేట్ అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతోంది. ఈ పాత్రలు ఒకదానికొకటి సంబంధం లేకుండా కొత్తగా వుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

0 comments:

Post a Comment