తమిళంలో చాలా మంది
అగ్రహీరోలతో నటించిన కాజల్అగర్వాల్ తొలిసారిగా ధనుష్తో జోడీ కట్టబోతుంది.
తన కెరీర్లో చేయబోతున్న వినూత్న ప్రేమకథా చిత్రమిదని, అభినయప్రాధాన్యత
వున్న చిత్రంలో అవకాశం రావడం అదృష్టమని కాజల్ పేర్కొంది. బాలాజీ మోహన్
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమా
గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ధనుష్ నటనంటే నాకు చాలా ఇష్టం.
తొలిసారిగా ఆయనతో కలిసి నటించడం ఆనందంగా వుంది.
కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించాను. అయితే ఇలాంటి హృద్యమైన ప్రేమకథా చిత్రంలో నటించలేదు. ఇందులో నా పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందన్న విశ్వాసముంది అని చెప్పింది. ఇదిలావుండగా ఇటీవలకాలంలో తమిళ చిత్రం నాన్బెండా విషయంలో కాజల్అగర్వాల్ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. అడ్వాన్స్ చెల్లింపు విషయంలో ఆమె బాధ్యతరహితంగా వ్యవహరించిందని పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తమిళ చిత్రసీమకు దూరమైతుందని భావించారంతా. తాజా చిత్ర అవకాశంతో కోలీవుడ్లో కాజల్కు లైన్ క్లియర్ అయినట్లేనని అంటున్నారు. ఈ సుందరి ఇటీవలే గోవిందుడు అందరివాడేలే చిత్రంతో తెలుగుప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించాను. అయితే ఇలాంటి హృద్యమైన ప్రేమకథా చిత్రంలో నటించలేదు. ఇందులో నా పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందన్న విశ్వాసముంది అని చెప్పింది. ఇదిలావుండగా ఇటీవలకాలంలో తమిళ చిత్రం నాన్బెండా విషయంలో కాజల్అగర్వాల్ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. అడ్వాన్స్ చెల్లింపు విషయంలో ఆమె బాధ్యతరహితంగా వ్యవహరించిందని పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తమిళ చిత్రసీమకు దూరమైతుందని భావించారంతా. తాజా చిత్ర అవకాశంతో కోలీవుడ్లో కాజల్కు లైన్ క్లియర్ అయినట్లేనని అంటున్నారు. ఈ సుందరి ఇటీవలే గోవిందుడు అందరివాడేలే చిత్రంతో తెలుగుప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment