Monday 8 September 2014

ఆ లడ్డూ బాలాపూర్ దే !

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది.  ఈ సారి లడ్డూ గత ఏడాదికంటే 24 వేల రూపాయలు అధికంగా పలికింది. గత ఏడాది, అంతకుముందు ఏడాది లడ్డూను స్థానికేతరులు వేలంపాటలో చేజిక్కించుకున్నారు. ఈ సారి మాత్రం బాలాపూర్ కే చెందిన సింగిరెడ్డి జయేందర్ రెడ్డి రూ.9.50 లక్షలకు పాడి చేజిక్కించుకున్నాడు. గత ఏడాది ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రూ.9.26 లక్షలకు ఈ లడ్డూను గెలుచుకున్నారు.
లడ్డూను వేలం పాటలో గెలుచుకున్న జయేందర్ రెడ్డి దానిని నెత్తిన పెట్టుకుని గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. లడ్డూను గెలుచుకున్నందుకు ఆయనకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో సన్మానం చేశారు.

0 comments:

Post a Comment