కుటుంబ కథా చిత్రాల్ని
రూపొందించడంలో తనదైన ప్రత్యేకతను కనబరుస్తారు దర్శకుడు దశరథ్. గ్రీకువీరుడు
తర్వాత తిరిగి ఆయన మెగాఫోన్ పట్టలేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్
కథానాయకుడిగా దశరథ్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిసింది. ఈ
చిత్రానికి కథ సిద్ధమైందని, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిదని
సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించనుంది.
ప్రస్తుతం వెంకటేష్ గోపాల గోపాల చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం
దశరథ్ చిత్రం సెట్స్మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment