Thursday 18 September 2014

దశరథ్ దర్శకత్వంలో వెంకటేష్ .....

కుటుంబ కథా చిత్రాల్ని రూపొందించడంలో తనదైన ప్రత్యేకతను కనబరుస్తారు దర్శకుడు దశరథ్. గ్రీకువీరుడు తర్వాత తిరిగి ఆయన మెగాఫోన్ పట్టలేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ కథానాయకుడిగా దశరథ్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి కథ సిద్ధమైందని, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిదని సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించనుంది. ప్రస్తుతం వెంకటేష్ గోపాల గోపాల చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం దశరథ్ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

0 comments:

Post a Comment