Friday 26 September 2014

ఒక్క ఐటెమ్‌సాంగ్ తో ఆదరగోడుతున్న భామలు....

ఎంత పాపులారిటీ ఉంటే అంత పారితోషికం లాగేయొచ్చు! అనేది నేటి కథానాయికల ఆలోచన. టాలీవుడ్‌లో అరడజను పైగా కథానాయికలు అందుకునే పారితోషికం కోటి పైమాటే. సదరు నాయికల క్రేజును బట్టి అంత పెద్ద మొత్తాలు ఇచ్చుకునేందుకు నిర్మాతలు సైతం వెనుకాడడం లేదు. అనుష్క, సమంత, కాజల్‌, నయనతార, తమన్నా, త్రిష ఇలా నాయికలంతా కోటి పైగానే పారితోషికం అందుకుంటున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో ఓ సినిమాకి పనిచేస్తే అందే పారితోషికం. అదే ఓ ఐదు నిమిషాల పాటు మెరిసే ప్రత్యేక గీతంలో నర్తిస్తే అందుకునే మొత్తం ఎంత? ఆరాతీస్తే చాలా సంగతులే తెలిశాయి. ఇటీవలే శృతిహాసన్‌ `ఆగడు' సినిమాలో ఐటెమ్‌ నంబర్‌లో నర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఐటెమ్‌ కోసం ఏకంగా రూ.40లక్షలు అందుకుందని సమాచారం. వాస్తవానికి శృతి పూర్తి నిడివి కథానాయికగా నటించినందుకు 1.25కోట్లు అందుకుంటోందని తెలుస్తోంది. కేవలం రెండు మూడు రోజుల్లో చిత్రీకరించేసే ఐటెమ్‌ నంబర్‌ కోసం అసలు పారితోషికంలో సగం అందుకున్నట్టే.

అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని హీరోగా తెరకి పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన `అల్లుడు శీను' సినిమాలో మిల్కీ వైట్‌ బ్యూటీ తమన్నా ఓ ఐటెమ్‌ నంబర్‌లో నర్తించింది. ఈ ప్రత్యేకగీతం కోసం తమన్నా కూడా దాదాపు 40లక్షలు వసూలు చేసిందని సమాచారం. అదే తీరుగా ఛార్మి, ప్రియమణి లాంటి కథానాయికలు ఐటెమ్‌ నంబర్లలో తళుక్కుమనాలంటే 30లక్షల నుంచి 60లక్షల వరకూ వసూలు చేసిన సందర్భాలున్నాయి. అదే బాలీవుడ్‌లో అయితే కత్రిన, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి క్రేజీ నాయికలకు ఐదు నిమిషాల ఐటెమ్‌ నంబర్‌ కోసమే కోటి నుంచి 2కోట్లు ఆఫర్‌ చేసిన సందర్భాలు కోకొల్లలు. జాక్విలిన్‌, నర్గీస్‌ఫక్రీ లాంటి నాయికలు 80లక్షల నుంచి కోటిన్నర వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా ఒక్క ఐటమె జీవితాల్నే మార్చేసేంత మొత్తాల్ని తెచ్చిపెడుతున్నాయన్నమాట!

0 comments:

Post a Comment