Sunday 14 September 2014

ఎన్టీఆర్‌కు జతగా సన్నీలియోన్ నర్తించబోతున్నట్లు సమాచారం.

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ తెలుగులో ఓ క్రేజీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. త్వరలోనే ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో ఆడిపాడనుంది. వివరాల్లోకి వెళితే...ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

ప్రతి సినిమాలో ఐటెంసాంగ్స్‌తో అభిమానుల్ని మెప్పించే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాలోనూ ఓ ఐటెంసాంగ్‌కు చోటు కల్పించినట్లు తెలిసింది. చిత్రంలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ గీతంలో ఎన్టీఆర్‌కు జతగా సన్నీలియోన్ నర్తించబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో ఆకట్టుకొన్న ఈ సుందరి నృత్యాలకు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఇటీవలే సన్నీలియోన్ సంప్రదించినట్లు తెలిసింది. అగ్ర హీరో సినిమా కావడంతో ఆమె కూడా వారి ఆఫర్‌ను అంగీరించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో కరెంటుతీగ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది సన్నీలియోన్.

0 comments:

Post a Comment