బాలీవుడ్ శృంగార తార
సన్నీలియోన్ తెలుగులో ఓ క్రేజీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. త్వరలోనే ఆమె
జూనియర్ ఎన్టీఆర్తో ఆడిపాడనుంది. వివరాల్లోకి వెళితే...ఎన్టీఆర్
కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం
తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కాజల్
అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
ప్రతి సినిమాలో ఐటెంసాంగ్స్తో అభిమానుల్ని మెప్పించే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాలోనూ ఓ ఐటెంసాంగ్కు చోటు కల్పించినట్లు తెలిసింది. చిత్రంలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ గీతంలో ఎన్టీఆర్కు జతగా సన్నీలియోన్ నర్తించబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్లో పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో ఆకట్టుకొన్న ఈ సుందరి నృత్యాలకు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఇటీవలే సన్నీలియోన్ సంప్రదించినట్లు తెలిసింది. అగ్ర హీరో సినిమా కావడంతో ఆమె కూడా వారి ఆఫర్ను అంగీరించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో కరెంటుతీగ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది సన్నీలియోన్.
ప్రతి సినిమాలో ఐటెంసాంగ్స్తో అభిమానుల్ని మెప్పించే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాలోనూ ఓ ఐటెంసాంగ్కు చోటు కల్పించినట్లు తెలిసింది. చిత్రంలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ గీతంలో ఎన్టీఆర్కు జతగా సన్నీలియోన్ నర్తించబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్లో పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో ఆకట్టుకొన్న ఈ సుందరి నృత్యాలకు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఇటీవలే సన్నీలియోన్ సంప్రదించినట్లు తెలిసింది. అగ్ర హీరో సినిమా కావడంతో ఆమె కూడా వారి ఆఫర్ను అంగీరించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో కరెంటుతీగ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది సన్నీలియోన్.
0 comments:
Post a Comment