Sunday 14 September 2014

భయపెట్టే మంత్ర-2

ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మంత్ర-2. ఎస్.వి. సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రీన్ ఫిలింస్ పతాకంపై పి. శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం మంత్రసినిమా చేశాను. నటిగా నా కెరీర్‌లో మైలురాయిలా నిలిచిన ఆ సినిమా స్థాయిలోనే మంత్ర-2 తెరకెక్కుతుంది. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది అని చెప్పింది. 

నిర్మాతలు మాట్లాడుతూ ఒక పాట, కొంత టాకీ మినహా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. తర్వలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కొత్తదనంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఛార్మి పాత్ర చిత్రణ వినూత్నంగా సాగుతుంది. చక్రి సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని అన్నారు. తనికెళ్ల భరణి, చేతన్, రాహుల్‌దేవ్, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గాంధీ మనోహర్, ఛాయాగ్రహణం:తనికెళ్ల రాజేంద్ర, సంగీతం: చక్రి, ఎడిటింగ్: సిద్ధంశెట్టి బాబు.

0 comments:

Post a Comment