క్రికెట్ దిగ్గజం సచిన్
టెండూల్కర్ పేరుతో ఓ సిరీస్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ
మండలి (బీసీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 26న జరిగే బీసీసీఐ వర్కింగ్
కమిటీ సమావేశంలో టెండూల్కర్ సిరీస్కు ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి.
‘సచిన్ పేరిట సిరీస్ నిర్వహించడం ఎంతో గర్వకారణం. ఏదో ఆషామాషీ సిరీస్లా
కాకుండా.. అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించాలని బోర్డు
యోచిస్తోంద’ని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపాడు. వచ్చే నెలలో
వెస్టిండీస్తో జరగబోయే సిరీస్కు సచిన్ పేరు పెడతారా అని అడగగా...దానికి
పటేల్ సమాధానమివ్వలేదు.
0 comments:
Post a Comment