టాలీవుడ్ లో మహేష్ మానియా మొదలైంది. ‘ఆగడు’ చిత్రంపై రోజు రోజుకి అంచనాలు
పెరిగిపోతున్నాయ్. అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి చిత్ర
బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ
చిత్రాన్ని సుమారు 2000 వేల స్క్రీన్స్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు
చేస్తున్నారు. ‘ఆగడు’ డిస్ట్రిబ్యూషన్ హక్కులను బాలీవుడ్ కి చెందిన ప్రముఖ
చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎరోస్ ఇంటర్నేషనల్’ సొంతం చేసుకుంది. మహేష్-శ్రీను
వైట్ల కాంబినేషన్ కావడంతో ‘ఆగడు’ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయ్. మహేష్
సరసన తమన్నా కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సంగీతం థమన్. 14 రీల్స్
ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
0 comments:
Post a Comment