Wednesday 10 September 2014

‘ఆగడు’కి 2000 థియేటర్లు!

టాలీవుడ్ లో మహేష్ మానియా మొదలైంది. ‘ఆగడు’ చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయ్. అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సుమారు 2000 వేల స్క్రీన్స్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఆగడు’ డిస్ట్రిబ్యూషన్ హక్కులను బాలీవుడ్ కి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎరోస్ ఇంటర్నేషనల్’ సొంతం చేసుకుంది. మహేష్-శ్రీను వైట్ల కాంబినేషన్ కావడంతో ‘ఆగడు’ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయ్. మహేష్ సరసన తమన్నా కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సంగీతం థమన్. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

0 comments:

Post a Comment