నారా రోహిత్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రౌడీ
ఫెలో’. కృష్ణ చైతన్య దర్శకుడు. ఇతనికిదే తొలి చిత్రం. షూటింగ్ చివరి దశకు
చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ను జరుపుకుంటోంది.
రోహిత్ కి జంటగా విశాఖ సింగ్ నటిస్తోంది. ‘రౌడీ ఫెలో’ పాటలను ఈ నెల 13న
గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఆడియో
వేడుకకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నట్లు సమాచారమ్.
పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి.. తదితరులు ప్రధాన పాత్రలు
పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సన్నీ. ప్రకాష్ రెడ్డి నిర్మాత.
0 comments:
Post a Comment