Sunday 4 January 2015

కార్తీకి జోడీగా శృతిహాసన్

నాగార్జున, కార్తీలతో ‘ఎవడు’ ఫేమ్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రంలో కార్తీకి జోడీగా శృతిని ఫైనలైజ్ చేశారు. ఈ విషయాన్ని శృతి ట్వీట్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ లలో ఐటెం సాంగ్స్ ను సైతం చెప్తూ కెరీర్ లో శృతి ముందుకు దూసుకుపోతున్నది. న్యూ ఇయర్ సందర్భంగా శృతి తన అభిమానులకు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఇచ్చింది. కార్తీతో శృతి నటించడం ఇదే మొదటిసారి. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు శృతి చెప్పుకొచ్చింది.
అయితే శృతి హాసన్..కార్తి అన్న సూర్యతో ‘సెవెంత్ సెన్స్’ లో జోడీ కట్టినా ఆ సినిమా ఆశించినంత ఫలితాన్నిఇవ్వలేదు.అయితే తెలుగు లో మాత్రం శ్రుతికి ‘గబ్బర్ సింగ్’ సినిమా హిట్ అయ్యేవరకూ ఈ సుందరిని ఐరెన్ లెగ్ హీరోయిన్ గా పిలిచేవారు. కానీ గబ్బర్ సింగ్ హిట్ తో శృతి ఫేట్ మారిపోయింది. అప్పట్నుంచి గోల్డెన్ లెగ్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నదీ చిన్నది. రామ్ చరణ్ కి జోడీ గా ‘ఎవడు’ ఫేమ్ వంశీ దర్శకత్వంలో సినిమా చేసింది. ఇప్పుడు కార్తి సరసన హీరోయిన్ గా వంశీపైడిపల్లి దర్శకత్వంలో మళ్ళీ చేస్తున్నది.
ప్రస్తుతం శృతి హాసన్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ సరసన నటిస్తోంది. 2014లో ‘రేస్ గుర్రం’ లాంటి బంపర్ హిట్ ను ఎంజాయ్ చేసిన శృతి 2015 లో హీరోయిన్ గా, ఐటెం గర్లగా కెరీర్ లో ముందుకు వెళ్తుంది. శృతి 2015 లో కూడా మంచి విజయాలను అందుకోవాలి.

0 comments:

Post a Comment