Saturday 3 January 2015

తొలిసారి జతకట్టనున్న చెర్రీ-సమంత జంట

’ గోవిందుడు అందరివాడేలే’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాని మొదలెట్టలేదు. ఇటీవలే శ్రీను వైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చెర్రీ. ప్రస్తుతం స్కిప్ట్ వర్క్ నడుస్తోంది. స్కిప్టుతో పాటుగా కాస్టింగ్ పై కూడా ఫోకస్ చేశాడు శ్రీను వైట్ల. ఇప్పటికే హీరోయిన్ గా సమంతను సెలక్ట్ చేసినట్లు సమాచారమ్. సమంత ఇప్పటివరకు చెర్రీతో జతకట్టలేదు. ఒకవేళ రాంచరణ్ ప్రక్కన సమంత జోడీ కడితే మాత్రం.. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. చరణ్ తో నటించే అవకాశం వచ్చినందుకు సామ్స్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసిందట. తొలిసారి జతకట్టనున్న చెర్రీ-సమంత జంట ఏ రేంజ్ లో రొమాన్స్ పండిస్తుందో.. చూడాలి. ఈ చిత్రంలో మరో కథానాయికకు కూడా చోటుందట. సెకండ్ హీరోయిన్ కోసం కూడా సెర్చ్ మొదలైనట్లు తెలుస్తోంది. మరీ.. ఆ అవకాశం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. అన్నట్టు.. ఈ చిత్రం త్వరలోనే ఈ చిత్రం కొబ్బరికాయ కొట్టుకోనుంది.

0 comments:

Post a Comment