సీతమ్మ వాకిట్లో సిరిమల్లె
చెట్టు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది అంజలి. ఇటీవల విడుదలైన
గీతాంజలి చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తెలుగు, తమిళ, కన్నడ
భాషల్లో బిజీగావుంది. అయితే ఈ సుందరి త్వరలో ఓ బిజినెస్మేన్ని పెళ్లి
చేసుకోనుందని జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సందర్భంగా అంజలి
మాట్లాడుతూ నేను త్వరలో ఓ వ్యాపారవేత్తను పెళ్లిచేసుకోబోతున్నానని వస్తున్న
వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అదంతా నేనంటే గిట్టని వారు నాపై చేస్తున్న
ప్రచారం మాత్రమే. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్పైనే వుంది.
పెళ్లి గురించి ఆలోచించే సమయం, తీరికా నాకు లేదు. కన్నడంలో ధీర రానా విక్రమ్ చిత్రంతో పాటు తమిళంలో జయం రవి హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాను. ఈ రెండు సినిమాలు నాకు హీరోయిన్గా మరిన్ని అవకాశాల్ని తెచ్చిపెడతాయన్న నమ్మకముంది. ఇప్పడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న నేను ఈ రంగంలో సాధించాల్సింది చాలా వుంది. అంత వరకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోదలుచుకోలేదుఅని తెలిపింది అంజలి.
ఇష్క్ మనం చిత్రాలతో దర్శకుడిగా సత్తాచాటారు విక్రమ్.కె.కుమార్. తాజా సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వంలో మహేష్బాబు ఓ చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కకున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
పెళ్లి గురించి ఆలోచించే సమయం, తీరికా నాకు లేదు. కన్నడంలో ధీర రానా విక్రమ్ చిత్రంతో పాటు తమిళంలో జయం రవి హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాను. ఈ రెండు సినిమాలు నాకు హీరోయిన్గా మరిన్ని అవకాశాల్ని తెచ్చిపెడతాయన్న నమ్మకముంది. ఇప్పడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న నేను ఈ రంగంలో సాధించాల్సింది చాలా వుంది. అంత వరకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోదలుచుకోలేదుఅని తెలిపింది అంజలి.
ఇష్క్ మనం చిత్రాలతో దర్శకుడిగా సత్తాచాటారు విక్రమ్.కె.కుమార్. తాజా సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వంలో మహేష్బాబు ఓ చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కకున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
0 comments:
Post a Comment