గోపీచంద్ పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన
భార్య రేష్మ మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
‘‘‘లౌక్యం’ విజయోత్సాహంలో ఉన్న మా ఇంట బాబు రాక ఆ ఆనందాన్ని రెట్టింపు
చేసింది. మా నాన్నే పుట్టారు’’ అని గోపీచంద్ సంబరపడిపోయారు. నేటి భారతం,
ప్రతిఘటన, రేపటి పౌరులు లాంటి ఎన్నో సంచలన చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు
టి. కృష్ణ కుమారుడే గోపీచంద్ అనే విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment