మహేష్ హీరోగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్
నిర్మిస్తున్న సినిమా ఈనెల 9 నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళుతోంది.
హైదరాబాద్లోనే షూటింగ్. నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్,
సి.వి.మోహన్ తదితరులు మాట్లాడుతూ- మీడియాలో ఇప్పటికే రకరకాల టైటిల్స్
వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకూ టైటిల్ నిర్ణయించనేలేదు. త్వరలోనే
అధికారికంగా మేమే ప్రకటిస్తాం. మా బ్యానర్లో తొలిచిత్రమే మహేష్తో చెయ్యడం
అదృష్టంగా భావిస్తున్నాం. మాకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
పెద్ద ఎత్తున సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేష్రుషి, సంపత్,
సుబ్బరాజు, తులసి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవీశ్రీ ప్రసాద్,
కెమెరా: మధి, థ్రిల్స్: అనల్ అరసు, కళ: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్
నిర్మాత: అశోక్కుమార్ రాజు.ఎం, చంద్రశేఖర్ రావిపాటి, రచన-దర్శకత్వం:
కొరటాల శివ.
0 comments:
Post a Comment