వరుస అవకాశాలతో దూసుకుపోతున్న
కథానాయిక ఎవరైనా అమ్మ పాత్రను చేయడానికి సాహసిస్తుందా?. మలయాళీ
ముద్దుగుమ్మ నిత్యామీనన్ అలాంటి ప్రయోగమే చేస్తోంది. విలక్షణ అభినయంతో
అనతికాలంలోనే దక్షిణాదిన ప్రతిభావంతమైన నటిగా గుర్తింపును సంపాదించుకన్న
ఆమె ఒక తెలుగు చిత్రంలో మధ్య వయస్కురాలైన అమ్మ పాత్రలో నటిస్తోంది.
వివరాల్లోకి వెళితే...శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతిమాధవ్ (ఓనమాలు
ఫేం) దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరిణితి
చెందిన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 18ఏళ్ల వయసున్న అమ్మాయికి
తల్లిగా నిత్యామీనన్ ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తోందట. నిత్యామీనన్ కూతురిగా
తేజస్విని (ఐస్క్రీమ్ ఫేమ్) నటిస్తోంది. 20ఏళ్ల కాలవ్యవధిలో ఈ చిత్ర కథ
నడుస్తుందని, కథానుగుణంగా నిత్యామీనన్ అమ్మ పాత్రలో కనిపిస్తుందని
తెలిసింది. తన పాత్రలో సహజత్వం కోసం నిత్యామీనన్ మేకప్పరంగా ప్రత్యేక
శ్రద్ధ తీసుకుంటోందని తెలిసింది.
0 comments:
Post a Comment