బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్
జోరు మీదుంది. విభిన్న చిత్రాలతో కెరీర్లో వేగాన్ని పెంచుతోంది. ఇప్పటికే
ఆమె కథానాయికగా నటిస్తోన్న పలు చిత్రాలు సెట్స్పైనుండగా మరో బాలీవుడ్
చిత్రానికి పచ్చజెండా ఊపింది. సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా రీమా కగ్తి
దర్శకత్వంలో మిస్టర్ ఛాలూ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. రితేష్ సిధ్వాని,
ఫర్హాన్ ఆక్తర్ నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్
కథానాయికగా ఎంపికైంది. ఇందులో సైఫ్ అలీఖాన్ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం
చేసి వారిని స్వప్రయోజనాలకు వాడుకునే వ్యక్తిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రను
పోషించనున్నట్లు సమాచారం. అతడి చేతిలో మోసపోయి ప్రతీకారం తీర్చుకునే
యువతిగా కంగనా రనౌత్ కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో
నాయకానాయికల ఇద్దరి పాత్రలు పోటాపోటీగా సాగుతాయని చిత్ర బృందం చెబుతోంది.
సవాల్తో కూడిన క్లిష్టతరమైన పాత్రను పోషించబోతున్నట్లు కంగనా రనౌత్
తెలిపింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్పైకి రానున్న ఈ సినిమా
చిత్రీకరణ మొత్తం గోవా, ముంబాయిలలో సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఉంగ్లీ ఐ
లవ్ న్యూ ఇయర్ డివైన్ లవర్స్ కట్టీ బట్టీ చిత్రాల్లో కథానానాయికగా
నటిస్తోంది కంగనా రనౌత్.
0 comments:
Post a Comment