పెళ్లి తర్వాత తెలుగు
సినిమాలకు గ్యాప్నిచ్చింది కథానాయిక స్నేహ. సుదీర్ఘ విరామం తర్వాత అనువాద
చిత్రం ఉలవచారు బిర్యానీతో ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా ఓ క్రేజీ
ఆఫర్తో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది స్నేహ. అల్లు అర్జున్ కథానాయకుడిగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం
తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతున్న ఈ సినిమాలో కథను
మలుపుతిప్పే ఓ కీలకమైన పాత్రలో స్నేహ నటించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్రకు
సరిపోయే నటి కోసం కొంతకాలంగా అన్వేషణ సాగిస్తున్న చిత్ర బృందం స్నేహను
సంప్రదించినట్లు తెలిసింది. ఆమె కూడా వారి ఆఫర్కు అంగీకారం తెలిపినట్లు
సమాచారం. ఇందులో ఆమె పాత్ర చిత్రణ కొత్తదనంతో సాగుతుందని చిత్ర వర్గాలు
చెబుతున్నాయి. త్వరలోనే సెట్స్పైకి రానున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్కు
జోడీగా సమంతా, అదాశర్మ, రాశిఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.
0 comments:
Post a Comment