విభిన్న చిత్రాలతో జాతీయస్థాయిలో అగ్రదర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ తో
ప్రస్తుతానికి తాను ఎలాంటి సినిమా చేయడం లేదని సూపర్ స్టార్ మహేశ్ బాబు
స్పష్టం చేశాడు. 'ఆగడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈనెల 19న వస్తున్న
మహేశ్.. తన రాబోయే చిత్రం మాత్రం శంకర్ తో కాదని తెలిపాడు. ఆగస్టు 30వ
తేదీన జరిగిన 'ఆగడు' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి శంకర్ ముఖ్య అతిథిగా
వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదని, తాను
శంకర్ దర్శకత్వంలో సినిమా ఏమీ చేయడంలేదని మహేశ్ తెలిపాడు.
'ఆగడు' సినిమా విడుదల కాగానే తన తదుపరి ప్రాజెక్టులో బిజీగా ఉంటానని ఈ సూపర్ స్టార్ చెప్పాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. తాను శంకర్ దర్శకత్వం వహించిన 'ఐ' సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో కూడా తాను పాల్గొనబోవడం లేదని మహేశ్ చెప్పాడు. ఆ సమయానికి తాను వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని చెబుతూ.. శంకర్ టీమ్ కు అభినందనలు తెలిపాడు.
'ఆగడు' సినిమా విడుదల కాగానే తన తదుపరి ప్రాజెక్టులో బిజీగా ఉంటానని ఈ సూపర్ స్టార్ చెప్పాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. తాను శంకర్ దర్శకత్వం వహించిన 'ఐ' సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో కూడా తాను పాల్గొనబోవడం లేదని మహేశ్ చెప్పాడు. ఆ సమయానికి తాను వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని చెబుతూ.. శంకర్ టీమ్ కు అభినందనలు తెలిపాడు.
0 comments:
Post a Comment