దక్షిణాదిలో
అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతోంది శృతిహాసన్. కెరీర్ తొలినాళ్లలో
వరుస అపజయాలు పలకరించినా చక్కటి ఆత్మవిశ్వాసంతో కెరీర్ను
తీర్చిదిద్దుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ
చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. హిందీలో ఏకంగా నాలుగు చిత్రాలు చేతిలో
వున్నాయి. తెలుగులో మహేష్బాబు నటిస్తున్న ఆగడు చిత్రంలో శృతిహాసన్ ఓ
ఐటెమ్సాంగ్లో నర్తించడంతో పాటు గీతాలాపన చేసిన విషయం తెలిసిందే.
2014 ప్రథమార్థంలోనే గొప్ప విజయాలు దక్కడం పట్ల శృతిహాసన్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఏడాది తన కెరీర్లో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పింది. ఈ సంవత్సరం అన్ని శుభాలే జరుగుతున్నాయి. సినిమా విజయాలతో పాటు కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తుల్ని కలుసుకునే అరుదైన అవకాశాలు లభిస్తున్నాయి. తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశం దొరికింది. ఈ ఏడాది నాకు నిజంగా సూపర్గా అనిపిస్తోంది అని శృతిహాసన్ ట్విట్టర్లో పేర్కొంది. ప్రస్తుతం తాను తమిళ చిత్రం పూజై కి డబ్బింగ్ చెబుతున్నానని, డబ్బింగ్ రూమ్లోని నిశ్శబ్దమంటే తనకెంతో ఇష్టమని చెప్పింది శృతిహాసన్.
2014 ప్రథమార్థంలోనే గొప్ప విజయాలు దక్కడం పట్ల శృతిహాసన్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఏడాది తన కెరీర్లో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పింది. ఈ సంవత్సరం అన్ని శుభాలే జరుగుతున్నాయి. సినిమా విజయాలతో పాటు కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తుల్ని కలుసుకునే అరుదైన అవకాశాలు లభిస్తున్నాయి. తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశం దొరికింది. ఈ ఏడాది నాకు నిజంగా సూపర్గా అనిపిస్తోంది అని శృతిహాసన్ ట్విట్టర్లో పేర్కొంది. ప్రస్తుతం తాను తమిళ చిత్రం పూజై కి డబ్బింగ్ చెబుతున్నానని, డబ్బింగ్ రూమ్లోని నిశ్శబ్దమంటే తనకెంతో ఇష్టమని చెప్పింది శృతిహాసన్.
0 comments:
Post a Comment