Friday 26 September 2014

రోమియో "పూరి రాసిన ప్రేమకథ"


సాయిరామ్ శంకర్, అడోనికా జంటగా నటిస్తున్న చిత్రం రోమియో. పూరి రాసిన ప్రేమకథ అనేది చిత్ర ఉపశీర్షిక. టచ్‌స్టోన్ దొరైస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రంతో గోపీగణేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోమియో, జూలియట్‌లు కలసిన వెరోనా ప్రాంతాన్ని సందర్శించినపుడు నా మనస్సులో మెదిలిన భావాలతో ఈ చిత్ర కథను తయారుచేసుకున్నాను.

స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా వుండే చిత్రమిది. కొన్ని కారణాల వల్ల విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించిన సినిమా అయిన సాంకేతికంగా ఉన్నతంగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ పూరి జగన్నాథ్ రాసిన కథ, డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఓ మంచి సినిమా చూశాననే తృప్తితో తిరిగివెళ్తాడు.

సునీల్ కశ్యప్ బాణీలు ఆకట్టుకుంటాయి అని అన్నారు. గత పదేళ్లలో వచ్చిన ప్రేమ కథాసినిమాల్లో ఉత్తమైనదిగా నిలిచిపోయే చిత్రమిదని మధుర శ్రీధర్ తెలిపారు. కథలోని కొత్తదనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని సాయిరాం శంకర్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టచ్‌స్టోన్ దొరైస్వామి, జెమిని కిరణ్, మల్టీడైమెన్షన్ వాసు, సునీల్ కశ్యప్, పి.జి.విందా తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment