Monday 8 September 2014

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి

ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఏడవడానికి కారణం ప్రియాంక చోప్రా కారణమైందట.  ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనవ్వడమే తన దుఖానికి  కారణమని శిల్పాశెట్టి తెలిపింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మేరి కోమ్' చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన శిల్పా. ప్రియాంక నటనను చూసి ఉద్వేగానిక లోనై కంటతడి పెట్టినట్టు ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
మేరి కోమ్ చిత్రాన్ని చూశాను. ప్రియాంక అద్బుతంగా నటించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం బాగుంది. ఈ చిత్రాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం అని శిల్ప ట్వీట్ చేశారు. బాక్సింగ్ చాంఫియన్ మేరి కోమ్ తో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు అభినందించారు. 

0 comments:

Post a Comment