విమానయాన సంస్థల మధ్య పోటీ
తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశీయ మార్గాల్లోనే ధరలను తగ్గించిన
సంస్థలు.. తాజాగా అంతర్జాతీయ రూట్లకు సైతం ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఖతార్
ఎయిర్వేస్, టైగర్ఎయిర్వేస్ ఇందుకు తెరలేపాయి. టైగర్ఎయిర్వేస్ను
ప్రారంభించి 20 ఏండ్లు పూర్తైన సందర్భంగా భారత్ నుంచి సింగపూర్ టికెట్ ధరను
రూ.10గా నిర్ణయించింది. కేవలం ఒక రూట్ మాత్రమే ఈటికెట్ వర్తించనున్నది.
మళ్లీ వచ్చే టప్పుడు కంపెనీ సేవలను ఎంచుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తిరుగు ప్రయాణ టికెట్ ధరను మాత్రం అన్ని పన్నులు కలుపుకొని రూ.7,499గా
నిర్ణయించింది. ఈ నెల 21 వరకు ఆఫర్ అందుబాటులో ఉండనున్నది. బుకింగ్
చేసుకున్నవారు వచ్చే ఏడాది జనవరి 12 నుంచి మార్చి 31, జూలై 21 నుంచి
సెప్టెంబర్ 22 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని కంపెనీ పేర్కొంది.
అలాగే ఖతార్ ఎయిర్వేస్ కూడా అంతర్జాతీయ టికెట్లపై 25 శాతం వరకు రాయితీ
ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 140 పట్టణాల మధ్య
నడుస్తున్న విమానాల్లో ఈ డిస్కౌంట్ ఆఫర్ లభించనున్నది. సోమవారం ప్రారంభమైన
ఈ ఆఫర్ బుధవారం వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
బుకింగ్ చేసుకున్న వారు ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది జూన్ 15 లోపు ఎప్పుడైనా
ప్రయాణం చేయవచ్చును. లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ
ప్రత్యేక ఆఫర్ భారత్ నుంచి వయా దోహా మీదుగా వెళ్లే విమానాలకు మాత్రమే
వర్తించనున్నది.
0 comments:
Post a Comment