మహేశ్ త్వరలో ‘మగాడు’గా రాబోతున్నాడా? ఫిలింనగర్
వర్గాలు అవుననే అంటున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ నటించనున్న
చిత్రానికి ‘మగాడు’ అనే టైటిల్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
అమితాబ్బచ్చన్ ‘దీవార్’ చిత్రాన్ని 1970ల్లో మహానటుడు ఎన్టీఆర్ ‘మగాడు’గా
రీమేక్ చేస్తే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
తర్వాత డా.రాజశేఖర్ కూడా ‘మగాడు’ పేరుతో ఓ సినిమా చేశారు. అదీ హిట్టే. అలా చూస్తే... ‘మగాడు’గా రాబోతున్న మూడో స్టార్ హీరో మహేశే అవుతారు. స్క్రిప్ట్ పరంగా మహేశ్ పాత్రను భిన్నంగా, అత్యంత శక్తిమంతంగా కొరటాల శివ డిజైన్ చేశారట. శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందించనున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తర్వాత డా.రాజశేఖర్ కూడా ‘మగాడు’ పేరుతో ఓ సినిమా చేశారు. అదీ హిట్టే. అలా చూస్తే... ‘మగాడు’గా రాబోతున్న మూడో స్టార్ హీరో మహేశే అవుతారు. స్క్రిప్ట్ పరంగా మహేశ్ పాత్రను భిన్నంగా, అత్యంత శక్తిమంతంగా కొరటాల శివ డిజైన్ చేశారట. శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందించనున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0 comments:
Post a Comment