Thursday 25 September 2014

రజనీకాంత్, మహేశ్‌ బాబు.. ఓ మల్టీ స్టారర్!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్  బ్రేకింగ్ న్యూస్. బ్లాక్బస్టర్  హీరోలు సౌత్ సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెరను పంచుకోనున్నారు. అవునూ.. వీరద్దరూ.. కలసి మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులకు అతి పేద్ద  పండుగ ,అసలు విషయంలోకి వెళితే.. యు. నారాయణ బాబు అనే సీనియర్ నిర్మాత సూపర్ స్టార్ కృష్ణకు మంచి సన్నిహితుడు. కృష్ణతో ఆయన దాదాపు 30చిత్రాలు నిర్మించారు. ఇటీవలే నారాయణ రజినీని కలవడం, సినిమా చేయాల్సిందిగా అడగడం.. అందుకు రజినీ ఒకే అనడం జరిగిపోయాయట. ఈ మూవీలోనే రజినీతో మహేష్ తెరపంచుకోనున్నాడు. ఈ సూపర్ స్టార్ల మల్టీస్టారర్ ఓకే అయినా.. అది పట్టాలెక్కేందుకు మరో రెండు సంవత్సరాలు పట్టొచ్చేమో. ఇంకా తొందరగా కుదిరితే.. ఫ్యాన్స్ కి పండగే మరీ.

0 comments:

Post a Comment