Monday 22 September 2014

ఓంకార్ "రాజుగారి గది"

‘జీనియస్’ చిత్రంతో దర్శకునిగా మారిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓంకార్... దర్శకునిగా తన ద్వితీయ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తన తమ్ముడు అశ్విన్ కథానాయకునిగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. హారర్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘రాజుగారి గది’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ ప్రముఖ టీవీ చానల్ సౌజన్యంతో ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వినికిడి. వచ్చేనెల తొలివారంలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

0 comments:

Post a Comment