Tuesday 23 September 2014

గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్ కొత్త చిత్రం...

అరంభం, వీరం విజయాలతో జోరు మీదున్నారు అజిత్. ఈ సినిమాలతో తిరిగి సక్సెస్‌ల బాట పట్టిన ఆయన వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పైనుండగానే ఆయన మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. వీరం ఫేం శివ దర్శకత్వంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి నిర్మించబోతున్నారు. ఇటీవలే సికిందర్ చిత్రంతో పరాజయాన్ని అందుకొన్న లింగుస్వామి త్వరలో అజిత్ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

0 comments:

Post a Comment