అంజలి ప్రధాన పాత్రలో గత సంవత్సరం
వచ్చిన గీతాంజలి మూవీ చిన్న చిత్రాల్లో పెద్ద హిట్ అయ్యింది. బాక్సాఫీస్
వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్
సినిమాకు హైలెట్ అయ్యింది. అంజలి తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది.
ఇప్పుడు గీతాంజలి డైరెక్టర్ రాజ్కిరణ్ ఆ సినిమాకు సీక్వెల్ తీసేందుకు
సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసేందుకు దర్శకనిర్మాతలు కలర్స్
స్వాతిని సంప్రదిస్తే ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు
త్రిపుర అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే
అవకాశం ఉంది. గీతాంజలిగా అంజలి ప్రేక్షకులను ఓ రేంజ్లో భయపెడితే ఇప్పుడు
కలర్స్ స్వాతి త్రిపురగా ఎలా భయపెట్టిస్తుందో చూడాలి.
0 comments:
Post a Comment