Saturday 24 January 2015

మల్టీస్టారర్ చిత్రాలు చేయమని అడుగుతున్నారు



డా.రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం గడ్డంగ్యాంగ్. జీవితారాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది.


ఈ సందర్భంగా డా.రాజశేఖర్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఆయన మరిన్ని విశేషాలు తెలియజేస్తూ తమిళ మాతృకలోని ఫీల్‌ను చెడగొట్టకుండా తెలుగులో రీమేక్ చేశాం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. ఇందులో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు. జర్నీ ఫేమ్ శరవణన్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన సురేష్ పీటర్ జయకుమార్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అచ్చు అందించిన నేపథ్య సంగీతం, విమల్ రాంబో ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అవుతుంది. ఈ చిత్రం తరువాత రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించిన పట్టపగలు విడుదలవుతుంది. ఆ తరువాత అర్జున చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఈ మూడు సినిమాలే కాకుండా ఈ ఏడాది మొత్తం నాకు సంబంధించిన ఏడు చిత్రాలు విడుదల కానున్నాయి. చాలా మంది మల్టీస్టారర్ చిత్రాలు చేయమని అడుగుతున్నారు. నేను చేయదగ్గ పాత్ర ఏదైనా వస్తే నటించడానికి నేను సిద్ధమే. హీరో పాత్రలే చేస్తాను. మరే ఇతర పాత్రలు చేయను అన్న నియమ నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు. గడ్డం గ్యాంగ్ విడుదల తరువాత మల్టీస్టారర్ చిత్రాలు చేయాలనుకుంటున్నాను అన్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు గడ్డంగ్యాంగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని జీవిత తెలిపింది.

0 comments:

Post a Comment