కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి వీరగాథను వెండితెర చిత్ర రూపం చేస్తూ స్వీయనిర్మాణ దర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ పాత్రలో నటిస్తోంది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరీయో స్కోపిక్ 3డీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ల క్రితం వసంతపంచమి పర్వదినాన వరంగల్లోని వేయిస్థంబాల దేవాలయంలో చిత్రాన్ని ప్రారంభించాం. రెండేళ్ల పాటు మహాయజ్ఞంలా సాగిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
డబ్బింగ్, గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని వేసవి ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కాకతీయుల చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాను అన్నారు. రానా, సుమన్, కృష్ణంరాజు, ప్రకాష్రాజ్, నిత్యామీనన్, ప్రభ, కేథరిన్, జయప్రకాష్రెడ్డి, ఆదిత్యమీనన్, ప్రసాదాదిత్య, అజయ్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, కెమెరా: అజయ్విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. రామ్గోపాల్, కథ, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.
0 comments:
Post a Comment