Tuesday 30 December 2014

ధోనీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై

మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అనంతరం ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ధోని 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా అందులో 60 టెస్ట్‌లకు నాయకత్వం వహించాడు.

అతని రిటైర్మెంట్ పై స్పందిస్తూ, ధోనీ అత్యుత్తమ భారత టెస్ట్ కెప్టెన్‌లలో ఒకరని, అతని నాయకత్వంలో భారత జట్టు టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్ర స్థానానికి ఎదిగిందని బీసీసీఐ ప్రశంసించింది. దీనితో వన్డే, టీ-20లలో మాత్రమే ధోనీ కొనసాగుతాడు.

మెల్‌బోర్న్ టెస్ట్‌లో ధోనీ పేరిట కొత్త రికార్డు నమోదైంది. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది మందిని అవుట్ చేయడంలో(8 క్యాచ్‌లు, 1 స్టంపింగ్) పాలు పంచుకున్న మొదటి భారత వికెట్ కీపర్ అయ్యాడు. ఆస్ట్రేలియా మీద ఈ ఫీట్ సాధించిన వారిలో ధోనీ మూడవ ఆటగాడు.

0 comments:

Post a Comment