1979...
ప. గో. జిల్లా, అత్తిలిలోని
ఎస్.వి.ఎస్.ఎస్.ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్...
వేసవి సెలవులు పూర్తయి వారం అవుతోంది.
అన్ని క్లాసుల్లోనూ స్టూడెంట్స్ పలుచ పలుచగా ఉన్నారు.
కానీ, ఒక్క క్లాస్ రూమ్ మాత్రం హౌస్ఫుల్!
ఒక తెలుగు లెక్చరర్ పద్యం పాడుతుంటే పిన్డ్రాప్ సెలైన్స్.
అదే పద్యాన్ని ఎన్టీఆర్లాగా, ఏయన్నార్లాగా, కృష్ణలాగా
మిమిక్రీ చేసి పాడుతుంటే అందరూ ఈలలూ చప్పట్లూ.
బట్టీ పట్టకుండానే ఆ పద్యం కంఠతా వచ్చేసింది వాళ్లకు.
ఆ లెక్చరర్ స్టయిలే అంత!
ఏదైనా కామెడీ మిళాయించే చెబుతారు.
చేదు మాత్రకు షుగర్ కోటింగ్ తరహా.
లేకపోతే ఓ తెలుగు క్లాస్కి అంత అంటెడెన్సా!
ఇలాంటి ఇన్సిడెంట్లు ఆ తెలుగు లెక్చరర్ ఖాతాలో చాలానే ఉంటాయ్.
ఇంతకూ ఆ తెలుగు లెక్చరర్ ఎవరో చెప్పనేలేదు కదా.
హి ఈజ్ వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం!
30 ఏళ్లుగా తెలుగు తెర నంబర్వన్ కమెడియన్.
ఆయన పూర్వాశ్రమంలో తెలుగు లెక్చరర్.
సుమారు ఎనిమిదేళ్లు అత్తిలి కాలేజ్లోనే పనిచేశారు.
ఆ ఊరితోనూ... ఆ కాలేజ్తోనూ...
అక్కడి స్టూడెంట్స్తోనూ...
బ్రహ్మానందంకు బోలెడంత అనుబంధం ఉంది.
ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లంతా ఎక్కడెక్కడో ఉన్నారు.
ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాళ్లకు ఇప్పటికీ గురువు గుర్తున్నారు.
వాళ్లల్లో కొంతమందిని తమ గురువు గురించి అడిగితే...
ఆ జ్ఞాపకాల ప్రవాహంలో తడిసి ‘బ్రహ్మానంద’భరితులయ్యారు.
0 comments:
Post a Comment