బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్
ఆధ్వర్యంలో టీవీ ప్రేక్షకుల ముందు మళ్లీ సత్యమేవ జయతే టాక్ షో సందడి
చేయనుంది. వచ్చే నెల 5 నుంచి ఈ షో మూడో సెషన్ ప్రారంభంకానుంది. ఈమేరకు
ప్రోమో విడుదలైనట్టు అమీర్ఖాన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నమస్తే..!
ఎస్ఎంజే కొత్త సెషన్ అక్టోబర్ 5నుంచి ప్రారంభమవుతుంది. దీని ప్రోమో
విడుదలైంది. చూసి.. మీ ఆలోచనలు పంచుకోండి.. అంటూ ఆ పోస్ట్లో అమీర్
విజ్ఞప్తి చేశారు. సామాజిక సమస్యలే ఇతివృత్తంగా ప్రసారమైన సత్యమేవ జయతే
రెండు సెషన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేశాయి. అయితే.. మూడో
సెషన్లోనూ సామాజిక సమస్యలే ఇతివృత్తమైనప్పటికీ, అమీర్ఖాన్ నేరుగా
ప్రేక్షకులతో చాటింగ్లో పాల్గొంటారు.
0 comments:
Post a Comment