Sunday 14 September 2014

అక్టోబర్ 5 నుంచి మళ్లీ సత్యమేవ జయతే

బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ఆధ్వర్యంలో టీవీ ప్రేక్షకుల ముందు మళ్లీ సత్యమేవ జయతే టాక్ షో సందడి చేయనుంది. వచ్చే నెల 5 నుంచి ఈ షో మూడో సెషన్ ప్రారంభంకానుంది. ఈమేరకు ప్రోమో విడుదలైనట్టు అమీర్‌ఖాన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నమస్తే..! ఎస్‌ఎంజే కొత్త సెషన్ అక్టోబర్ 5నుంచి ప్రారంభమవుతుంది. దీని ప్రోమో విడుదలైంది. చూసి.. మీ ఆలోచనలు పంచుకోండి.. అంటూ ఆ పోస్ట్‌లో అమీర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక సమస్యలే ఇతివృత్తంగా ప్రసారమైన సత్యమేవ జయతే రెండు సెషన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేశాయి. అయితే.. మూడో సెషన్‌లోనూ సామాజిక సమస్యలే ఇతివృత్తమైనప్పటికీ, అమీర్‌ఖాన్ నేరుగా ప్రేక్షకులతో చాటింగ్‌లో పాల్గొంటారు.

0 comments:

Post a Comment