Tuesday 30 December 2014

మన దేశం లోనే రూ. 214 కోట్ల కలెక్షన్లు

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు భారత్ లోనూ 214 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.

కాగా ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో పాటు అమీర్ నటనకు ప్రశంసలు రావడంతో ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటించారు.

0 comments:

Post a Comment