రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన
ప్రయోగాత్మక చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ
నెల 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు భారత్ లోనూ 214 కోట్ల రూపాయలను
వసూలు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.
కాగా ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో పాటు అమీర్ నటనకు ప్రశంసలు రావడంతో ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటించారు.
కాగా ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో పాటు అమీర్ నటనకు ప్రశంసలు రావడంతో ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటించారు.
0 comments:
Post a Comment